పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి దిగుతున్నారు . ఈ వార్త కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చర్చనియాంశంగా మారింది .
ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు . తెలంగాణ జిల్లాలో ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మహారాష్ట్రలో సైతం విద్యాసంస్థలు నెలకొల్పారు . టీచర్ గా కెరియర్ ప్రారంభించి కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత స్థాయికి ఎదిగిన నరేందర్ రెడ్డి అంటే ప్రజల్లో మంచి నమ్మకం , గౌరవం ఉంది . నరేందర్ రెడ్డి తన కార్యచరణ ఇప్పటి నుండే మొదలుపెట్టారు .పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఇప్పటికే ప్రారంభించారు . లక్ష మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి భారీ మెజార్టీతో గెలుపొందాలని వ్యూహం రచించారు .
అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తనకే ఉంటుందనే ధీమాతో నరేందర్ రెడ్డి ఉన్నారు . కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు విద్యాసంస్థలు అధినేతలు నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేయాలని ఆశించిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు .ఎంపీ టికెట్ కూడా ఆశించారు . వివిధ సామాజిక కోణాల కారణంగా ఇతరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు . అయితే ఈసారి కాంగ్రెస్ మద్దతు తనకే ఉంటుందని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నారు . వచ్చే ఫిబ్రవరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది . అయితే కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నరేందర్ రెడ్డి పర్యటిస్తూ ప్రచారం మొదలుపెట్టారు . ఎమ్మెల్సీగా తన గెలుపు ఖాయం అనే ధీమాతో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు .
ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు . తెలంగాణ జిల్లాలో ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మహారాష్ట్రలో సైతం విద్యాసంస్థలు నెలకొల్పారు . టీచర్ గా కెరియర్ ప్రారంభించి కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత స్థాయికి ఎదిగిన నరేందర్ రెడ్డి అంటే ప్రజల్లో మంచి నమ్మకం , గౌరవం ఉంది . నరేందర్ రెడ్డి తన కార్యచరణ ఇప్పటి నుండే మొదలుపెట్టారు .పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఇప్పటికే ప్రారంభించారు . లక్ష మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి భారీ మెజార్టీతో గెలుపొందాలని వ్యూహం రచించారు .
అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తనకే ఉంటుందనే ధీమాతో నరేందర్ రెడ్డి ఉన్నారు . కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు విద్యాసంస్థలు అధినేతలు నరేందర్ రెడ్డి కి మద్దతు ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది .
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేయాలని ఆశించిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు .ఎంపీ టికెట్ కూడా ఆశించారు . వివిధ సామాజిక కోణాల కారణంగా ఇతరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు . అయితే ఈసారి కాంగ్రెస్ మద్దతు తనకే ఉంటుందని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నారు . వచ్చే ఫిబ్రవరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది . అయితే కరీంనగర్ మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో నరేందర్ రెడ్డి పర్యటిస్తూ ప్రచారం మొదలుపెట్టారు . ఎమ్మెల్సీగా తన గెలుపు ఖాయం అనే ధీమాతో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు .