రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాల కు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం ను కొనుగోలు, సత్వర చెల్లింపులు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సురేష్, షేత్కర్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.