ఆదాయ సృష్టి పై ప్రత్యేక దృష్టి సారించాలి.
మహిళా సంఘాలు తమ రుణాలను సకాలంలో చెల్లించాలి.
మహిళా సమాఖ్య కార్యాలయం అవసరమైన మౌలిక వసతుల ప్రతిపాదనలు సమర్పించాలి
జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ పెద్దపెల్లి ఎంపీడీవో ప్రాంగణంలోనీ జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు .
మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు సకాలంలో చెల్లింపులు చేయాలని, ఎన్.పి.ఏ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మహిళా సంఘాలు తమకు అందుతున్న బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే కార్యక్రమాలు అమలు పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం నిర్వహణ మొదలగు వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడం పై కలెక్టర్ చర్చించి పలు సూచనలు జారీ చేశారు . ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు అందించే బ్యాంకు రుణాలను వినియోగించుకుంటూ వాణిజ్య వ్యాపార రంగాల్లో మహిళలు వృద్ధి సాధించాలని ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ కోరారు.
జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. మహిళా సమాఖ్య కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ,టాయిలెట్స్ మరమ్మత్తులు, నూతన టాయిలెట్ నిర్మాణం మొదలగు ప్రతిపాదనలు అందించాలని వాటిని వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు .
జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ పెద్దపెల్లి ఎంపీడీవో ప్రాంగణంలోనీ జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు .
మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు సకాలంలో చెల్లింపులు చేయాలని, ఎన్.పి.ఏ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మహిళా సంఘాలు తమకు అందుతున్న బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే కార్యక్రమాలు అమలు పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం నిర్వహణ మొదలగు వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడం పై కలెక్టర్ చర్చించి పలు సూచనలు జారీ చేశారు . ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు అందించే బ్యాంకు రుణాలను వినియోగించుకుంటూ వాణిజ్య వ్యాపార రంగాల్లో మహిళలు వృద్ధి సాధించాలని ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ కోరారు.
జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. మహిళా సమాఖ్య కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ,టాయిలెట్స్ మరమ్మత్తులు, నూతన టాయిలెట్ నిర్మాణం మొదలగు ప్రతిపాదనలు అందించాలని వాటిని వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు .