(పొలిటికల్ ఫ్యాక్టరీ – గోదావరిఖని )
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దొంగలు రెచ్చిపో యారు.
గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో శుక్రవారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్ల గొట్టి డబ్బు దోచుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసికెమెరాలను పరిశీ లించిన పోలీసులకు షాక్ తగిలింది.
సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.