– కనీస వేతన చట్టం అమలుకు కృషి
– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
జగిత్యాల * :రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు (MBS) *మినిమమ్ బేసిక్ శాలరీ కనీస వేతన చట్టం అమలుకు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు..బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పలువురు పట్టభద్రులను కలసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలుపాలని కొరారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపిస్తే నిరుద్యోగ నిర్ములనకు కృషి చేస్తానని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.. ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవల అమలుతో పాటు, హెల్త్ కార్డులుజారికి కృషి చేస్తానని అన్నారు.. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు స్కాలర్షిప్ బకాయిలు రాక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని.. వారికీ పెండింగ్ బకాయిలు ప్రభుత్వం నుండి ఇప్పించెందుకు కృషి చేస్తానాని అన్నారు…కేజీబీవి లలో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు తమకు ఉద్యోగ భద్రత లేదని, వారు వాపోతున్నారని, వారికీ MTS అమలు తో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.. విద్య రంగం నుండి వచ్చిన తనకు, ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ట భద్రుల సమస్యల పై పూర్తిగా అవగాహనా ఉందని… వారి సమస్యల పరిష్కారం కోసం చిత్త శుద్ధి తో పని చేస్తానని హామీ ఇచ్చారు… రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని వేడుకొన్నారు.. పట్టభద్రుల శ్రేయస్సు తన ప్రధాన లక్ష్యమని మరియు వారిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే తన ప్రధాన ధ్యేయమని అన్నారు.. ప్రవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత తో పాటు ఆరోగ్య భీమా కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు. పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ఎజెండా అని.. పోటీ పరీక్షల ఆశావాహులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా వారి సౌకర్యం ఆన్లైన్ క్లాసెస్ సైతం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు..