జగన్ జిమ్మిక్ లను నమ్మని జనం
గతం లో విజయమ్మ కన్నా ఘోర పరాభవం చుసిన బొత్స ఝాన్సీ.
నమ్మకద్రోహాన్ని సహించని విశాఖ ప్రజలు
విశాఖ రాజధాని గా రెఫరెండం జరిగిన ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఇచ్చిన తీర్పు
విశాఖ ను పాలనా రాజధాని గా చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాటలని విశాఖ వాసులు విశ్వసించలేదు. తమ కళల రాజధాని అంటూ వైసీపీ నేతలు చెప్పిన వ్యాఖ్యలను వాల్తేరు ప్రజలు నమ్మలేదు. అందుకు ఉదాహరణ విశాఖ ఎంపీ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ కు వచ్చిన అత్యధిక మెజారిటీ. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పై శ్రీభరత్ కు 5,04,247 ఓట్లతో ఘన విజయం సాధించడం విశాఖ ప్రజల ఏకపక్ష తీర్పు ను సూచిస్తోంది.
గత ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్లతో ఓటమి చెందిన శ్రీభరత్, ఈసారి దుమ్ము దులిపేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అత్యధికం కావడం ఇక్కడి విశేషం. దాదాపు 65. 42 శతం ఓట్లతో విశాఖ ప్రజలు శ్రీభరత్ కు నీరాజనం పట్టారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి 29. 07 శాతం మాత్రమే ఓట్లు రావడం వైసీపీ విశాఖ పైన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఏ రీతి లో వ్యతిరేకత చుపించారో అర్ధం చేసుకోవచ్చు..
అంతే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గా గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు 95 వేల కు పైగా మెజారిటీతో, భీమిలి నుండి గంట శ్రీనివాసరావు 92 వేల కు పైగా మెజారిటీతో, విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు 70 వేల కు పైగా మెజారిటీతో జనసేన నుండి పెందుర్తి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్ బాబు 81 వేల కు పైగా మెజారిటీ తో విశాఖ దక్షిణ నుండి పోటీ చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు 64 వేల ఓట్లతో విజయదుందుభి మ్రోగించారు..
గత ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్లతో ఓటమి చెందిన శ్రీభరత్, ఈసారి దుమ్ము దులిపేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అత్యధికం కావడం ఇక్కడి విశేషం. దాదాపు 65. 42 శతం ఓట్లతో విశాఖ ప్రజలు శ్రీభరత్ కు నీరాజనం పట్టారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి 29. 07 శాతం మాత్రమే ఓట్లు రావడం వైసీపీ విశాఖ పైన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఏ రీతి లో వ్యతిరేకత చుపించారో అర్ధం చేసుకోవచ్చు..
అంతే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గా గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు 95 వేల కు పైగా మెజారిటీతో, భీమిలి నుండి గంట శ్రీనివాసరావు 92 వేల కు పైగా మెజారిటీతో, విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు 70 వేల కు పైగా మెజారిటీతో జనసేన నుండి పెందుర్తి నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్ బాబు 81 వేల కు పైగా మెజారిటీ తో విశాఖ దక్షిణ నుండి పోటీ చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు 64 వేల ఓట్లతో విజయదుందుభి మ్రోగించారు..