వాషింగ్టన్:ఇప్పుడున్న కాలంలో ప్రతి పౌరుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం అందులో వాట్సప్ యాప్ ఉండటం సర్వసాదారంణంగా మారింది. ముఖాముఖి మాట్లడుకోవటం తగ్గించిన యువత వాట్సప్, టెలిగ్రామ్, వైబర్ లాంటి యాప్లలోనే మాట్లడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రోజుకో కొత్త యాప్ పుట్టుకొస్తోంది. కాగా, ఇప్పటివరకైతే వాట్సప్ యాప్ అత్యధిక వినియోగదారులతో ఏ యాప్కు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయింది. అయితే 130 కోట్ల వినియోగదారులను కలిగియున్న ఫేస్బుక్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానం వాట్సప్దే.గత ఏడాది ఆగస్టులో 60 కోట్ల వినియోగదారులను కలిగియున్న వాట్సప్ నేటికి 70 కోట్లకి చేరింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో జాన్ కూమ్ వాషింగ్టన్లో వెల్లడించారు. వాట్సప్ ద్వారా రూ. 1.18 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాట్సప్ వినియోగదారులు ఇంత భారీగా పెరగడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతీ రోజూ వినియోగారులు వాట్సప్ ద్వారా 30 బిలియన్ మెసేజ్లు పంపుకుంటున్నారని చెప్పారు. మరొక సంవత్సరంలోగా వాట్సప్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్కు చేరుకుంటుందని ఫేస్బుక్ సిఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. కాగా, ఇన్స్టాగ్రామ్ 30 కోట్ల వినియోగదారులను, ట్విట్టర్ 28.4 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి.