చిత్తూరు, ప్రతినిధి : తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అలిపిరి రెండో ఘాట్రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలపాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని స్థానిక రుయా ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.