చిన్న అవినీతి జరిగినా బిజెపిని
విడిచి పెట్టే ప్రసక్తే లేదు..
బిజెపి పాలకవర్గం పారదర్శకంగా
పాలన సాగించాలి..
ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లపై నిఘా పెడతాం..
ప్రజల పక్షాన నిలుస్తాం..
అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తాం..
కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా..
అవినీతికి పాల్పడ్డ వారే మేయర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్తగా ఏర్పడిన బిజెపి పాలకవర్గం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ విజిలెన్స్ సెల్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కార్పొరేటర్ మేయర్ గా, మేయర్ గా పని చేస్తున్న వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.
సోమవారం సాయంత్రం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్రావు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్న అవినీతి జరిగినా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా పనులపై పర్యవేక్షణకు ప్రత్యేక విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పని ప్రతి పేమెంటు మానిటరింగ్ చేసి నాణ్యత పరిశీలించి ప్రభుత్వం బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామన్నారు. ప్రజలను అవినీతి అక్రమాల నుంచి కాపాడుతామని స్పష్టం చేశారు. బిజెపి పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా పెడతామని తేడాలు వస్తే ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని బిజెపి పాలకవర్గం జాగ్రత్తగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. గత బిఆర్ఎస్ హాయంలో జరిగినట్లు
అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నాడు కేంద్రమంత్రి బండి సంజయ్ సునీల్ రావు అవినీతిపరుడని అనేకసార్లు విమర్శించి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. నాడు విమర్శించి నేడు మళ్ళీ డిప్యూటీ మేయర్గా ఎంపిక చేయడంపై ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని మళ్లీ పదవులు ఇవ్వడం పట్ల విస్మయం కలుగుతుందన్నారు. కార్పొరేషన్ లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అవతరించినా
కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సహకారంతో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పెద్ద ఎత్తున నిధులు తెస్తానని పేర్కొన్నారు. ఎవరు చేయని విధంగా ఏ ఎమ్మెల్యే తేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ లో అవినీతికి ఆస్కారం లేకుండా క్లీన్ గా పాలన సాగించేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ప్రతి అభివృద్ధి పనిపై మానిటరింగ్ చేసి బిల్లులు ఇప్పించేలా చూస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుకు కట్టుబడి పని చేస్తామన్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా ప్రజా అవసరాలకు ఎలాంటి డబ్బులు ఆశించకుండా బిజెపి పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఒకవేళ అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా బిజెపి పాలకవర్గం పనిచేయాలని సూచించారు. కరీంనగర్ రైసింగ్ ఆర్గనైజేషన్ పేరిట ప్రతి డివిజన్లో ముగ్గురు వ్యక్తులతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు బిల్డింగ్ పర్మిషన్లు ఇతరత్రా పనులకు సంబంధించి పర్యవేక్షణ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు జరిగేలా చూస్తామన్నారు. కరీంనగర్ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు మేనిఫెస్టో ప్రకారం కరీంనగర్ అభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, భాస్కర్ నాయక్ గుమ్మడి రాజకుమార్, ఆకుల నందిని ఉదయ్, పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య, కల్లేపల్లి శారద బాలరాజు, సికిందర్ ఇక్రమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు