మండుటెండలో జన నీరాజనం
పిల్లలు, పెద్దలు, మహిళలుసహా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కేరింతలు
పూలు చల్లి కొందరు..హారతి ఇచ్చి మరికొందరు నీరాజనం
టవర్ సర్కిల్ వద్ద బ్రహ్మరథం పట్టిన వ్యాపారులు..
వేలాదిగా తరలిరావడంతో కాషాయ సంద్రమైన కరినగరం
బండి నామినేషన్ కు భారీగా హాజరైన కార్యకర్తలు
ఎస్సారార్ కాలేజీ నుండి టవర్ సర్కిల్ మీదుగా గీతాభవన్ వరకు…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్ర భాయి రజనీకాంత్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఉదయం 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, క్రిష్నారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ గన స్వాగతం పలికారు. అక్కడి నుండి సరిగ్గా ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ రావడంతో వారితో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం 11.20 గంటలకు అక్కడి నుండి నేరుగా ఎస్సారార్ కళాశాల వద్దకు వచ్చారు. ఉదయం 9 గంటలకే ఎస్సారార్ కళాశాల వద్దకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. భూపేంద్రభాయి పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఘన స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం… వేలాది మందితో కలిసి ర్యాలీగా బయలుదేరారు.. కొద్దిదూరం ర్యాలీలో పాల్గొన్న అనంతరం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వారికి వీడ్కోలు పలికిన బండి సంజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సారార్ కాలేజీ నుండి కోర్టు చౌరస్తా, రాజీవ్ చౌక్, గంజ్, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్, కమాన్, గీతాభవన్ వరకు…దాదాపు రెండున్నర గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా చిన్నారులు, మహిళలు, వ్రుద్దులు సైతం ఇండ్ల నుండి బయటకు వచ్చి బండి సంజయ్ ను చూసి అభివాదం చేయడం, విక్టరీ సింబల్ చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల మహిళలు ఎదురేగి పూలు చల్లి, హరతి పట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.
ఇగ చిన్న పిల్లలు, యువత ఆనందానికి హద్దు లేదు. బండి సంజయ్ ను చూడగానే ‘అదిగో బండి సంజయన్న’’ అంటూ బండి సంజయన్న జిందాబాద్… మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ర్యాలీలో డీజే పాటలను వింటూ యువత తీన్మార్ డ్యాన్సులు చేశారు….దారి వెంట వెళుతూ ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కాలిబాటన వెళ్లే పౌరులు..ఇలా ప్రతి ఒక్కరూ సంజయ్ ను చూస్తూ అభివాదం చేశారు.
మరోవైపు టవర్ సర్కిల్ వద్ద వ్యాపారుల నుండి అనూహ్య స్పందన లభించింది. బండి సంజయ్ వద్దకు వ్యాపారులు స్వచ్చందంగా తరలి వచ్చి స్వాగతం పలుకుతూ కొందరు, కరచాలనం చేస్తూ మరికొందరు, ఆయన వద్దకు వచ్చి ఆలింగనం చేస్తూ ఇంకొందరు తమ అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకున్నారు. మొత్తంగా మిట్ట మధ్యాహ్నం 45 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా బండి సంజయ్ ర్యాలీకి కార్యకర్తలు దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ నిర్వహించడం.. ప్రజలు నుండి అనూహ్య స్పందన రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి..
నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్ర భాయి రజనీకాంత్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఉదయం 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు రాగానే బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, క్రిష్నారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ గన స్వాగతం పలికారు. అక్కడి నుండి సరిగ్గా ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ రావడంతో వారితో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం 11.20 గంటలకు అక్కడి నుండి నేరుగా ఎస్సారార్ కళాశాల వద్దకు వచ్చారు. ఉదయం 9 గంటలకే ఎస్సారార్ కళాశాల వద్దకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. భూపేంద్రభాయి పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఘన స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం… వేలాది మందితో కలిసి ర్యాలీగా బయలుదేరారు.. కొద్దిదూరం ర్యాలీలో పాల్గొన్న అనంతరం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వారికి వీడ్కోలు పలికిన బండి సంజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సారార్ కాలేజీ నుండి కోర్టు చౌరస్తా, రాజీవ్ చౌక్, గంజ్, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్, కమాన్, గీతాభవన్ వరకు…దాదాపు రెండున్నర గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా చిన్నారులు, మహిళలు, వ్రుద్దులు సైతం ఇండ్ల నుండి బయటకు వచ్చి బండి సంజయ్ ను చూసి అభివాదం చేయడం, విక్టరీ సింబల్ చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల మహిళలు ఎదురేగి పూలు చల్లి, హరతి పట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.
ఇగ చిన్న పిల్లలు, యువత ఆనందానికి హద్దు లేదు. బండి సంజయ్ ను చూడగానే ‘అదిగో బండి సంజయన్న’’ అంటూ బండి సంజయన్న జిందాబాద్… మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ర్యాలీలో డీజే పాటలను వింటూ యువత తీన్మార్ డ్యాన్సులు చేశారు….దారి వెంట వెళుతూ ఆటోవాలాలు, ద్విచక్రవాహనదారులు, కాలిబాటన వెళ్లే పౌరులు..ఇలా ప్రతి ఒక్కరూ సంజయ్ ను చూస్తూ అభివాదం చేశారు.
మరోవైపు టవర్ సర్కిల్ వద్ద వ్యాపారుల నుండి అనూహ్య స్పందన లభించింది. బండి సంజయ్ వద్దకు వ్యాపారులు స్వచ్చందంగా తరలి వచ్చి స్వాగతం పలుకుతూ కొందరు, కరచాలనం చేస్తూ మరికొందరు, ఆయన వద్దకు వచ్చి ఆలింగనం చేస్తూ ఇంకొందరు తమ అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకున్నారు. మొత్తంగా మిట్ట మధ్యాహ్నం 45 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా బండి సంజయ్ ర్యాలీకి కార్యకర్తలు దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ నిర్వహించడం.. ప్రజలు నుండి అనూహ్య స్పందన రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి..