(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థటీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్,ఏఎస్ ఆర్టీయూ ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి.
2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కా రాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి.
రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది.
సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతి కత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించి నందుకు గాను మరో ప్రథమ బహుమతిని టీఎస్ఆర్టీసీ గెలుచుకుంది.
ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న టీఎస్ఆర్టీసీ ఉన్నతాధి కారులకు అందజేస్తున్నట్లు ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది.